పాతకక్షల నేపథ్యంలో ఘర్షణ

బోగోలు మండలం కోళ్ళదిన్నెలో ఘటన

ఇరువురు కావలి ఏరియా వైద్యశాల వద్ద పరస్పర దాడులు

బోగోలు మండలం కోళ్ళదిన్నె గ్రామం మహాలక్ష్మమ్మ దేవాలయానికి సంబంధించిన భూవివాదంలో
రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిపై వంటేరు తిరుపతి, గోపాల్ మరి కొంతమంది కలిసి దాడి చేసినట్లు బాధితుడు తెలిపాడు. మహాలక్ష్మ దేవాలయ స్థలాన్ని
వంటేరు తిరుపతి, గోపాల్ లు ఇటీవల ఆక్రమించి దిబ్బ వేశారని శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. దీనిపై గతంలో ఆర్డిఓకు పిర్యాదు చేయడంతో దిబ్బను తొలగించారన్నారు.
ఇది మనసులో పెట్టుకున్న
వంటేరు తిరుపతి , గోపాల్ లు తనపై దాడి చేశాడని చెప్పాడు. అంతటితో ఆగక తాను చికిత్స కోసం కావలి ఏరియా వైద్యశాలకు వచ్చాక అక్కడ కూడా వచ్చి
దాడి చేశారని తెలిపారు. ఇదిలాఉంటే ఘర్షణలో గాయాలు అయ్యాయని వంటేరు తిరుపతి ఏరియా హాస్పిటల్ లో చేరారు. పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *