ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి
వింజమూరులో స్వచ్ఛ ఆంధ్ర
స్వచ్ఛ దివస్ ర్యాలీ
నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలో ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమం జరిగింది. స్థానిక పంచాయతీ ఆఫీస్ ప్రాంగణం నుంచి బంగ్లా సెంటర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ… మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా, మన ప్రాంతాలన్నీ స్వచ్ఛత వైపు అడుగులు వేసే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయని అని అన్నారు. ముఖ్యంగా మన జీవన గమనంలో ప్లాస్టిక్ వినియోగం అత్యంత ప్రమాదానికి గురి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, నాయుకులు, పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.