అట్టహాసంగా ఏటి పండుగ
గొబ్బెమ్మల ప్రతిమలకు ప్రత్యేక పూజలు చేసిన మహిళలు
అలరించిన సాంస్కృతి కార్యక్రమాలు – పాల్గొన్న మంత్రి నారాయణ, టీడీపీ ముఖ్య నేతలు
సంక్రాంతి పండుగ సందర్భంగా…నెల్లూరు పెన్నాతీరంలో ఏటి పండుగ అట్టహాసంగా ప్రారంభమైంది. భక్తులు విశేషంగా తరలి రావడంతో….పెన్నాతీరం జనసంద్రంగా మారింది. పెన్నాతీరాన్ని విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు. సాంస్కృతి కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. తీరమంతా చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా పతంగులు ఎగుర వేస్తూ…ఆటలు ఆడుతూ…పాటలు పాడుతూ…కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేస్తూ గడిపారు. మహిళలు మట్టితో చేసిన గొబ్బెమ్మల ప్రతిమలకు ప్రత్యేక పూజలు నిర్వహించి నదిలో నిమజ్జనం చేశారు. పండుగకి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మున్సిపల్ శాఖాధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పాల్గొని…ఏటి పండుగను ప్రారంభించి…గొబ్బెమ్మలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వేమిరెడ్డి విజయభాస్కర్రెడ్డి, రేవతి, మామిడాల మధు, యక్బాల్, మైనుద్దీన్, టీడీపీ నేతలు, కార్పొరేషన్, పోలీసు అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.