మా నాయ‌కుడు వ‌స్తున్నాడు

త్వ‌ర‌లో చిత్తూరులో పెద్ద ఎత్తున ధ‌ర్నా

పాత బ‌స్టాండులో వ‌ర్త వ్యాపారుల జోలికి వ‌స్తే ఊరుకోం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్య‌క్షులు క‌రుణాక‌ర్‌రెడ్డి హెచ్చ‌రిక‌

పాత బస్టాండు వర్తక వ్యాపారులను ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోబోమని… చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు క‌రుణాక‌ర్‌రెడ్డి హెచ్చ‌రించారు. ఈ సందర్భంగా…వైఎస్ఆర్సిపి చిత్తూరు నియోజకవర్గ ఇన్చార్జి విజయానంద ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వ‌ద్ద‌ వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ధర్నా చేపట్టారు… ఈ కార్యక్రమానికి కరుణాకర్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ధ‌ర్నాలో పాల్గొని వ్యాపారుల‌కి సంఘీభావం ప్ర‌క‌టించి…ఎవ‌రూ అధైర్య‌ప‌డొద్ద‌ని మీ అంద‌రికి త‌మ నాయ‌కుడు జ‌గ‌న్మోహన్ రెడ్డి, పార్టీ ఎల్ల‌ప్పుడూ అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసా క‌ల్పించారు. ఈ సంద‌ర్భంగా క‌రుణాక‌ర్‌రెడ్డి మాట్లాడుతూ….ప్ర‌భుత్వం తీరు మార్చుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. త్వ‌ర‌లో పెద్ద ఎత్తున ధ‌ర్నా చేప‌డుతున్నామ‌ని…ఈ ధ‌ర్నాకి మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి విచ్చేస్తార‌న్నారు. ప్ర‌భుత్వ అనాలోచిత నిర్ణ‌యాల వ‌ల్ల చిరు వ్యాపారుల కుటుంబాలు రోడ్డు ప‌డుతాయ‌ని మండిప‌డ్డారు. కార్యక్రమంలో నాయకులు డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, గాయత్రి దేవి, రాహుల్ రెడ్డి, అను, అంజలి రెడ్డి, హరీష్ రెడ్డి, బిందురెడ్డి, పెద్ద సంఖ్య‌లో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *