లోకోస్ యాప్ ఫోక్స్ పర్సన్ చిన్నయ్య
రాపూరు డీఆర్డీఏ కార్యాలయంలో సంఘమిత్ర సీసీలు, వీవోఏలకు శిక్షణా తరగతులు
ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలం డి ఆర్ డి ఏ కార్యాలయంలో లోకోస్ యాప్ వినియోగంపై సంఘమిత్ర సీసీలు, వివోయేలకు మూడు రోజుల శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో లోకోస్ యాప్ ఫోక్స్ పర్సన్ పి, చిన్నయ్య పాల్గొని వారికి పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా చిన్నయ్య మాట్లాడుతూ…దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీలను ఇక నుంచి లోకోస్ యాప్ ద్వారానే లావాదేవీలను చేయవలసి ఉంటుందన్నారు. సభ్యురాలకు సంఘానికి సంబంధించిన వివరాలు ఏ విధంగా లోకోస్ యాప్ లో ఎలా నమోదు చేయాలి, ఏ విధంగా అమలు పరచాలన్న తదితర విషయాలను ఈ శిక్షణలో ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రాపూరు ఏపిఎం రాధా, సీసీలు,వివోఏలు, పాల్గొన్నారు.