కోత‌ల బ‌డ్జెట్‌

రైతాంగాన్ని, కార్మికుల్ని మోసం చేసిన కేంద్రం

మీడియా స‌మావేశంలో వామ‌ప‌క్ష పార్టీల నేత‌లు

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ కోత‌ల బ‌డ్జెట్ అని…దీనివ‌ల్ల రైతాంగానికి కానీ, కార్మికుల‌కి కానీ ఎటువంటి ప్ర‌యోజ‌నం లేద‌ని…వామ‌ప‌క్ష పార్టీల నేత‌లు ఆరోపించారు. నెల్లూరు న‌గ‌రంలోని సీపీఎం కార్యాల‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రైతు సంఘం జిల్లా అధ్య‌క్షుడు శ్రీ‌రాములు, సీపీఎం నేత మూలం ర‌మేష్‌, సీపీఎం ఎంఎల్‌ నేత రాంబాబు, ఆలిండియా పార్వ‌డ్ బ్లాక్ జిల్లా క‌న్వీన‌ర్‌ న‌ర‌సింహ‌రావులు మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. ఏ దేశ‌మైనా అభివృద్ధి చెందాలంటే…ముందు వ్య‌వ‌సాయ రంగం అభివృద్ధి చెందాల‌ని తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ కేవ‌లం పెద్ద‌వాళ్ల‌కి, పెత్త‌దారుల‌కే ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. రైతాంగాన్ని, కార్మికుల్ని కేంద్రం మోసం చేసింద‌ని విమ‌ర్శించారు. వెంట‌నే కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను విర‌మించుకోవాల‌ని డిమాండ్ చేశారు. లేని ప‌క్షంలో విడ‌త‌ల వారీగా ఉద్య‌మాలు చేప‌డుతామ‌ని వారు హెచ్చ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *