అవాక్కైన భక్తులు
తిరుమలకు శ్రీ వెంకటేశ్వరుని క్షణకాలం దర్శన భాగ్యం కోసం వచ్చిన భక్తులను క్యూలైన్ లో తనవైపు తిప్పుకునేలా చేశాడు ఓ భక్తుడు. ఒంటిపై ఏకంగా భారీ స్థాయిలో అభరణాలు ధరించడం చూసిన శ్రీవారి భక్తులు ఆకర్షితులు అయ్యారు. తిరుమలకు మంగళవారం నాడు హైదరాబాద్ కు చెందిన హోప్ ఫౌండేషన్ అధినేత కొండా విజయ్ కుమార్ స్వామి వారి సేవలో పాల్గొన్నారు. రెండు చేతుల్లో వేళ్లకు సరిసమానంగా చేతి ఉంగరాలు, రెండు చేతులకు భారీ కంకణాలు, మెడలో పెద్ద చైన్లను ధరించారు. ఆయన ఒంటిపై దాదాపు 5 కేజీల బరువు తో 4 కోట్ల రూపాయల విలువ చేసే బంగారు అభరణాలు ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు. వామ్మో ఇంత బంగారమా అంటూ భక్తులు అవాక్కయ్యారు.