తెలుగువాడి గుర్తింపుకు కారణం…NTR

ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి

నెల్లూరు టీడీపీ కార్యాల‌యంలో ఎన్టీఆర్ 29వ వ‌ర్ధంతి

ఎన్టీఆర్ విగ్ర‌హానికి నివాళుల‌ర్పించిన ఎంపీ, అజీజ్‌, శ్రీ‌నివాసులురెడ్డి

ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు ప్రపంచంలో తెలుగువాడి గుర్తింపుకు కారణమ‌ని…నెల్లూరు పార్ల‌మెంట్ స‌భ్యులు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాల‌యంలో… తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త ఎన్టీ రామారావు 29వ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ వేమిరెడ్డితోపాటు…పార్టీ జిల్లా అధ్య‌క్షుడు, రాష్ట్ర వ‌క్ఫ్ బోర్డ్ చైర్మ‌న్ అబ్ధుల్ అజీజ్‌, నుడా చైర్మ‌న్ కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డిలు పాల్గొని…దివంగ‌త ఎన్టీఆర్ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. జోహార్ ఎన్టీఆర్ అంటూ త‌మ అభిమానాన్ని చాటుకున్నారు. ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ…తెలుగు జాతికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తున్న నాయకుడు చంద్రబాబు అన్నారు. అజీజ్ మాట్లాడుతూ…సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లో సైతం నిజమైన నాయకుడు ఎన్టీఆర్ అని తెలిపారు. నుడా చైర్మ‌న్ శ్రీ‌నివాసులురెడ్డి మాట్లాడుతూ…ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ కుటుంబ సభ్యుడిగా నన్ని భావించడం నా పూర్వ జన్మ సుకృతం అన్నారు. ఎన్టీఆర్ పథకాలు ఎందరికో ఆదర్శనీయమ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మ‌లో టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *