ఆత్మకూరు సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం

ఆత్మ‌కూరులో జ‌రిగిన అభివృద్ధి కార్య‌క్ర‌మాల డ్రోన్ విజువ‌ల్స్‌

అందరి సహకారంతోనే శరవేగంగా అభివృద్ధి

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

ఆత్మకూరులో అట్టహాసంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

హాజరైన మంత్రులు నారాయణ, ఫరూక్‌, బిసి జనార్దన్‌రెడ్డి, సవిత, ఎంపీ వేమిరెడ్డి

టీడ్కో కాలనీలో రామాలయం, పంచాయతీరాజ్‌ అతిథిగృహానికి శంకుస్థాపనలు

ఆర్‌అండ్‌బి అతిథిగృహం, బీసీ బాలికల గురుకుల పాఠశాల ప్రారంభోత్సవాలు

గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ఏ ఎస్ పేట మండలం జమ్మవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. గ్రామంలో రూ. 4.80 లక్షలతో నిర్మించిన రెండు క్యాటిల్ షెడ్స్ ను, 8 లక్షలు తో నిర్మించిన సిమెంట్ రోడ్డును మంత్రి ప్రారంభించారు. తొలిసారిగా మంత్రి హోదాలో జమ్మవరం గ్రామానికి విచ్చేసిన ఆనంకు ప్రతి గడపలోనూ గ్రామస్థులు, నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో విద్యారమ, డ్వామా పిడి గంగాభవాని, పశుసంవర్ధక శాఖ జెడి రమేష్ నాయక్, పంచాయతీరాజ్ ఎస్ ఈ అశోక్ కుమార్, డిఈ ఏడుకొండలు, సర్పంచ్ దొరసానమ్మ, ఎంపీటీసీ సుశీల, మండల స్థాయి అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *