సిఐ శివరామకృష్ణ రెడ్డి – జర్నలిస్టులకు హెల్మెట్ల పంపిణీ
పొదలకూరులో హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించిన పోలీసులు
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జాతీయ రహదారి మాసోత్సవాలలో భాగంగా నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో సి.ఐ.శివరామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ నుండి హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పట్టణ పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మోటార్ సైకిల్ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. పట్టణంలోని ప్రధాన రహదారి గేటు సెంటర్ నుండి సంఘం రోడ్డు కూడలి వరకు బైకులపై జర్నలిస్టులు, యువకులు హెల్మెట్లు ధరించి భారీ ఎత్తున ర్యాలీని నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. అదే విధంగా యువకులు ద్విచక్ర వాహనాలు వేగంగా నడపకుండా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. అనంతరం పట్టణంలోని జర్నలిస్టులకి సీఐ హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ ర్యాలీలో ఎస్సై హనీఫ్, పోలీసులు స్వయంగా హెల్మెట్లు ధరించి బైకులను నడుపుతూ ప్రజలను చైతన్య పరిచారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు యువకులు తదితరులు పాల్గొన్నారు.