అక్రమార్కుల గుండెల్లో గుబులు

కొత్తూరులో ఇసుక అక్ర‌మ ర‌వాణాపై త‌హ‌సీల్దార్ మెరుపు దాడులు

ప‌రుగులు తీసిన అక్ర‌మార్కులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని వీకే రామావరం గ్రామ పంచాయతీలో కొత్తూరు గ్రామ సమీపంలో అక్ర‌మార్కులు పెద్ద ఎత్త‌న ఇసుక నిల్వ‌ల‌ను ఉంచారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు… త‌హసీల్దార్ పుల్లారావు, ఆర్ఐ బాదావ‌త్ బ‌ద్రు నాయ‌క్‌లు ఇసుక నిల్వ‌ల‌పై అర్ధ‌రాత్రి మెరుపులు చేసి గుబులు పుట్టించారు. త‌హ‌సీల్దార్ రాక‌తో అక్ర‌మార్కులు భ‌య‌ప‌డి ప‌రుగులు తీశారు. అక్ర‌మంగా నిల్వ ఉంచిన 25 ట్రిప్పుల ఇసుక‌ను గురించి త‌హ‌సీల్దార్ కార్యాల‌యానికి త‌ర‌లించారు. ఈ సంద‌ర్భంగా త‌హ‌సీల్దార్ మీడియాతో మాట్లాడుతూ…ఇసుక అక్ర‌మ ర‌వాణా పాల్ప‌డితే ఎంత‌టివారినైనా ఉపేక్షించ లేద‌ని హెచ్చ‌రించారు. ఇసుక అక్ర‌మ నిల్వ‌ల‌పై వివ‌రాలు తెలియ‌జేయాల‌ని, వారి వివ‌రాలు గోప్యంగా ఉంచుతామ‌ని ఆయ‌న చెప్పారు. ఇక‌పై నిరంత‌రం దాడులు చేస్తామ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *