వ‌క్ఫ్ బోర్డ్ అంటే వ్య‌క్తుల ఆస్తులు కాదు…

కేవ‌లం కేర్ టేక‌ర్సే

వ‌క్ఫ్ బోర్డు స్థ‌లాల‌పై అబ్ధుల్ అజీజ్ కామెంట్స్

ఎంఏ ష‌రీఫ్‌ను…రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారుగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు నియ‌మించ‌డం, ఆయ‌న మొద‌టి ప‌ర్య‌ట‌న నెల్లూరు జిల్లాకే విచ్చేయ‌డం సంతోష‌క‌ర‌మ‌ని… రాష్ట్ర వ‌క్ఫ్ బోర్డ్ చైర్మ‌న్‌, టీడీపీ పార్ల‌మెంట్ అధ్య‌క్షులు షేక్ అబ్ధుల్ అజీజ్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాల‌యంలో….ఎంఏ ష‌రీఫ్‌తో క‌లిసి మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం ఈ రాష్ట్రాన్ని ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టేయ‌డ‌మే కాకుండా…రాజ‌ధాని లేని రాజ్యంగా చేసింద‌ని మండిప‌డ్డారు. మైనార్టీల‌ను ప్రోత్స‌హించే ఏకైక వ్య‌క్తి సీఎం చంద్ర‌బాబునాయుడు అని కొనియాడారు. వ‌క్ఫ్ బోర్డ్ అంటే వ్య‌క్తుల ఆస్తులు కాదని…అవ‌న్నీ భ‌గ‌వంతుని స్థ‌లాల‌న్నారు. వారంద‌రూ కేవ‌లం కేర్ టేక‌ర్స్ అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *