ప్రైమరీ స్కూల్స్ ని ఎత్తేసేందుకు చంద్రబాబు కుట్రలు
సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజం
సీఎం చంద్రబాబు వందేళ్లు అధికారంలో ఉన్నా.. విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురాలేరని… ఎమ్మెల్సీ, నెల్లూరు నగర నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు. నెల్లూరు రాంజీ నగర్లోని తన కార్యాలయంలో చంద్రశేఖర్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. చంద్రబాబు పాలనపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎనిమిది నెలల్లో చంద్రబాబు విద్యావ్యవస్థను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైమరీ స్కూల్స్ ను ఎత్తేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. 117 జీవో ద్వారా జగన్ అద్బుతమైన వ్యవస్థకు శ్రీకారం చుడితే.. చంద్రబాబు నాశనం చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి ట్యాబ్స్ ఇస్తే.. వాటిని రిపేర్ కూడా చేయించలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు విద్యావ్యవస్థలో విద్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు.