ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్
ఉదయగిరిలోని ఎంఆర్ఆర్ డిగ్రీ కళాశాలను రూ. 5 కోట్లతో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించారు. కళాశాలను, ప్రాంగణం తదితర వాటిని ఎమ్మెల్యే పరిశీలించారు. ఉపాధ్యాయులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముందుగా ఎమ్మెల్యేని శాలువాతో సత్కరించారు. గతంలో డిగ్రీ కళాశాల భవనాలకు కిటికీలు కూడా లేని దుస్థితిలో అధ్వానంగా ఉందన్నారు. కళాశాలను అన్నీ అభివృద్ధి చేసి…విద్యార్థులకి అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి, మైనారిటీ నాయకులు షేక్ రియాజ్, మండల కన్వీనర్ బయన్న, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.