శంకరనగరంలో విషాదం
నెల్లూరు జిల్లా, అనంతసాగరం మండలంలోని శంకరనగరం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామంలోని కొమ్మలేరు వాగులో ఓ మహిళ ప్రమాదవశాత్తు పడిపోయింది. దీనిని గమనించిన ఆమె కుమారుడు..తన తల్లిని కాపాడబోయి నీటిలో మునిగిపోయాడు. నీటిలోని బురదలో చిక్కుకుపోయి ఆకాష్ అనే యువకుడు మృతి చెందాడు. ఆకాష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ సూర్య ప్రకాష్ రెడ్డి, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి, వివరాలను సేకరిస్తున్నారు.