ఆ హాస్ట‌ల్‌లో ఏం జ‌రిగింది..?

  • ఇద్ద‌రు ప‌దో త‌ర‌గ‌తి బాలిక‌లు మిస్సింగ్‌
  • అన్ని కోణాల్లో విచారిస్తున్న పోలీసులు

తిరుపతి జిల్లా గూడూరులో ఇద్దరు బాలికల మిస్సింగ్ కలకలం రేపింది… రెండో పట్టణ పరిధిలోని జానకిరాంపేటలోని గిరిజన గురుకుల హాస్టల్ నుండి బాలికలు ఇద్దరు అదృశ్యం అయ్యారు..బాలికలు పదో తరగతి చదువుతున్న జయశ్రీ ,చందన గా గుర్తించారు… జయశ్రీ స్వస్థలం సైదాపురం ,చందన స్వస్థలం నెల్లూరు ఎన్టీఆర్ నగర్ గా తెలుస్తుంది… విద్యార్థినిల అదృశ్యంపై హాస్టల్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ద‌ర్యాప్తులో భాగంగా సోమ‌వారం రాత్రి పోలీసులు ఆ హాస్టల్ కు వెళ్లి.. సిబ్బందిని.. తోటి విద్యార్థినుల‌ను విచారిస్తున్నారు… అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హాస్ట‌ల్‌లో సిబ్బంది ఇబ్బందుల‌కు గురిచేస్తున్నారా..?

తోటి విద్యార్థినుల‌తో ఏదైనా ఇబ్బంది ఉందా..? ఎవ‌రేమైనా అన్నారా..? ప‌దో త‌ర‌గ‌తి కాబ‌ట్టి.. చ‌దివే ఒత్తిడి తట్టుకోలేక అక్క‌డి నుంచి ప‌రార్ అయ్యారా..? లేక‌.. ఇంకేమైనా జ‌రిగిందా..? ఇంకెవ‌రైనా కిడ్నాప్ చేశారా..? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ప‌ట్ట‌ణంలో.. ఆ వ‌స‌తి గృహ ప‌రిస‌రాల‌ల్లో, ఆర్టీసీ బ‌స్టాండు, రైల్వే స్టేష‌న్‌, ఇత‌ర ముఖ్య కూడ‌ళ్ల‌ల్లో సీసీ కెమెరాల‌ను ప‌రిశీలించే ప‌నిలో నిమగ్న‌మ‌య్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *