- విధులకు హాజరుకాని ఉద్యోగులు
- సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలకు తప్పని ఇక్కట్లు
- ఒక్కరు కూడా లేకపోవడం ఏంటని సర్వత్రా విమర్శలు
బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని సచివాలయం 3 ఖాళీగా దర్శనమిస్తుంది. సచివాలయంలో సిబ్బంది ఎవరు లేకపోవడంతో ప్రజలు పనిపై వెళ్లి వెనక్కి తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల ప్రభుత్వం సర్వే చేపట్టమని ఆదేశాలు జారీ చేసే విషయం తెలిసిందే. అయితే సచివాలయంలో కనీసం ఒక అధికారి కూడా లేకుండా అందరూ వెళ్లిపోవడం ఏమిటని ప్రజల ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి.. ప్రజలకు నిరంతరం సచివాలయంలో సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.