- విద్యార్ధులను ప్రోత్సహించేందుకు జాతీయస్థాయిలో పోటీ పరీక్షలు
- నెల్లూరు శ్రీచైతన్య జూనియర్ కళాశాల ఆవరణంలో పోటీపరీక్షల పోస్టర్ ఆవిష్కరణ
- ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయస్ధాయిలో డిసెంబరు 6 నుండి 13 వరకు ప్రతిభా పరీక్ష
- వివరాలు వెల్లడించిన కెఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాసరావు
మెరిట్ విద్యార్ధులను ప్రోత్సహించేందుకు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో విజయవాడ, హైదరాబాద్, బెంగుళూరు క్యాంపస్లలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికై జాతీయస్ధాయిలో ప్రతిభా పరీక్షను డిసెంబరు 6 నుండి 13 వరకు నిర్వహిస్తున్నట్లు కెఎల్డిమ్డ్ యూనివర్సిటీ అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాసరావు తెలిపారు. శ్రుక్రవారం నెల్లూరులోని శ్రీచైతన్య జూనియర్ కళాశాల ఆవరణంలో పోటీ పరీక్షకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ స్టాయిలో జరిగే ఈ పరీక్షలో ప్రతిభావంతులైన విద్యార్ధులకు 100కోట్ల రూపాయల మెరిట్ స్కాలర్షిప్ అందజేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జె.వి.షణ్ముఖకుమార్, ఆంధ్రప్రదేశ్ కర్నాటక కేఎల్డిమ్డ్ యూనివర్శిటీ జోనల్ హెడ్ బి.శివరామకృష్ణ శ్రీచైతన్య గ్రూప్ ఆఫ్ జూనియర్ కళాశాలల డీన్ శ్రీనాధ్. ప్రిన్సిపాల్ డి.శ్రీధర్, ఎం.దిలీప్కుమార్, కె.సురేష్బాబు, కెఎల్ డిమ్డ్ యూనివర్సిటీ నెల్లూరు, ప్రకాశం జిల్లాల రీజనల్ మేనేజర్ కె.రాంబాబు, మేనేజర్లు ఆర్.శేఖర్బాబు, పి.ఆంజనేయప్రసాద్రావు, ఎ.మస్తాన్వలి, షేక్.నాయబ్, జి.కళ్యాణ్బాబు, టి.రజితలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.