- నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు
- కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టిన నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి
ధార్మిక, సేవ కార్యక్రమాల్లో వీపీఆర్ వెనుక ఉంటూ మంచి మహిళగా పేరుగా తెచ్చుకున్న ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన అతి తక్కువ కాలంలోనే నియోజకవర్గంలో అన్నీ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో టిడిపి బీసీ ముదిరాజ్ సాధికార సమితి కన్వీనర్ పి ఎల్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నుడా ఛైర్మన్ శ్రీనివాసులురెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ టీటీడీ బోర్డ్ మెంబర్గా ఉన్నప్పుడు చేపట్టిన ధార్మిక కార్యక్రమాలు, మెట్టప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మంచినీటి వాటర్ప్లాంట్ల ద్వారా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న వీపీఆర్ దంపతులు రాజకీయంలో కూడా తమ వంతు చేస్తూ ప్రత్యేకత చాటుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, నగర అధ్యక్షులు మామిడాల మధు, ఎల్సీ రమణారెడ్డి, మహిళ అధ్యక్షరాలు పనబాక భూలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.