డిజిట‌ల్ అరెస్ట్‌ల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి

  • అలాంటి కాల్స్ వ‌స్తే 1930 కి ఫిర్యాదు చేయండి
  • ఎన్‌3తో మాట్లాడిన‌ సూళ్లూరుపేట సీఐ ముర‌ళీకృష్ణ‌

డిజిట‌ల్ అరెస్ట్‌ల‌పై ప్ర‌జ‌లంతా అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌ని సూళ్లూరుపేట సీఐ ముర‌ళీకృష్ణ సూచించారు. తిరుప‌తి జిల్లా సూళ్లూరుపేట పోలీస్‌స్టేష‌న్‌లో ఎన్‌3తో సీఐ ప్ర‌త్యేకంగా మాట్లాడారు. అన్నీ వ‌ర్గాల ప్ర‌జ‌లు డిజిట‌ల్ అరెస్ట్‌ల వ‌ల్ల మోస‌పోతున్నార‌న్నారు. అన్‌నోన్ కాల్స్ వ‌స్తే ఎవ‌రు కూడా తీసి మాట్లాడ‌వ‌ద్ద‌ని సూచించారు. డివిజ‌ల్ అరెస్ట్‌ల వ‌ల్ల భార‌త‌దేశ వ్యాప్తంగా 8 వంద‌ల కోట్ల మోసం జ‌రిగింద‌ని చెప్పారు. ఎవ‌రికైనా పోలీస్‌స్టేష‌న్ల నుంచి కాల్ వ‌చ్చిందంటే వెంట‌నే స్థానిక పోలీసుల‌ను సంప్ర‌దించి ఫిర్యాదు చేయాల‌న్నారు. ఒక‌వేళ మోసం జ‌రిగితే వెంట‌నే 1930 కాల్ చేసి స‌మాచారం ఇవ్వాల‌ని కోరారు. ఇలాంటి కాల్స్‌పై ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సీఐ ముర‌ళీకృష్ణ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *