- ప్రజలకు, అధికారులకు ప్రత్యక్షంగా అవగాహన
వరదలు, విపత్తులు, ప్రమాదాలు సంభవించినప్పుడు ఆస్తి నష్టం కన్నా ప్రథమంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడటం ప్రభుత్వాల బాధ్యత. అందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలంలోని కోటపోలురు గ్రామం పెద్దన్న గారి చెరువు వద్ద నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందం మార్క్ డ్రిల్ నిర్వహించి ప్రజలకు అధికారులకు గురువారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు అవగాహన కల్పించారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలు ఎలా పనిచేస్తాయో ప్రత్యక్షంగా చూపించారు. ఎన్.డి.ఆర్.ఎఫ్ కమాండెంట్ వి.వి.ఎన్ ప్రసన్న కుమార్, ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఎస్.వి.నరసింహారావు పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కమతం అరుణకుమారి, వాసంరెడ్డి సుధాకర్ రెడ్డి, పోలీస్ శాఖ సీఐ.మురళీకృష్ణ, ఎస్ఐ బ్రహ్మనాయుడు, ఫైర్ సిబ్బంది, ఎన్డిఆర్ఎఫ్ బృందం, వైద్యశాఖ, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.