- కలువాయి ఎస్సై సుమన్
నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని ఉమా మహేశ్వరి కళ్యాణమండపంలో.. కలువాయి ఎస్ఐ సుమన్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ సూచనల మేరకు విద్యార్థులకు యాంటీ డ్రగ్స్, యాంటీ ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రగ్స్ వాడకం వల్ల సమాజంలో వచ్చే దుష్పరిణామాలు, ఆరోగ్య సమస్యల గురించి విద్యార్థులకు కలువాయి ఎస్సై సుమన్ వివరించారు. చాలామంది యువత సరదాగా మొదలుపెట్టిన ఈ అలవాటు.. వ్యసనంగా మారి.. భవిష్యత్తును నాశనం చేస్తుందని.. కాబట్టి విద్యార్థులు అవగాహన కలిగి ఉండి.. అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు హితవు పలికారు.
ఎలాంటి పదార్థాలు డ్రగ్స్ కిందకి వస్తాయి.. వాటికి విద్యార్థులు ఏ విధంగా ఆకర్షితులు అవుతారు.. అనే అంశాలపై విపులంగా వివరించారు. ఇంకా అనేక విషయాలపై ఆయన విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శేషగిరిరావు, హై స్కూల్ హెచ్ఎమ్ అబ్బాస్ అలీ, సీనియర్ అసిస్టెంట్ తిరుమల రావు, ఫారెస్ట్ అధికారి నాగులు, రిటైర్డ్ టీచర్ మల్లికార్జున్, విద్యార్థులు, యువకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.