ఆ…8 ట‌న్నుల కందిప‌ప్పుకి లెక్క ఏది…?

  • గ‌త మూడేళ్లుగా గోదాములోనే నిల్వ‌
  • మాకేం తెలియ‌దంటున్న అధికారులు
  • వాకాడులోని సివిల్ స‌ప్ల‌య్స్ గోదాముని సంద‌ర్శించిన ఎన్‌3 న్యూస్ ప్ర‌తినిధి

ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా వాకాడు మండ‌లంలోని సివిల్ స‌ప్ల‌య్స్ గోదాములో…గ‌త మూడేళ్లుగా సుమారు 8 ట‌న్నుల కందిప‌ప్పు నిల్వ ఉంది. గ‌త మూడేళ్లుగా కందిప‌ప్పుని ఎందుకు ప్ర‌జ‌ల‌కి పంపిణీ చేయ‌కుండా, ఎందుకూ ప‌నికి రాకుండా ఉంచార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఈ విష‌యం తెలుసుకున్న ఎన్‌న్యూస్ ప్ర‌తినిధి గోదాముకు వెళ్లి ప‌రిశీలించ‌గా అక్క‌డ నిల్వ ఉంచిన కందిప‌ప్పు, బియ్యం కంట‌పడ్డాయి. ఎందుకు నిల్వ ఉంచార‌ని…వెంట‌నే సంబంధిత అధికారుల్ని వివ‌ర‌ణ కోర‌గా…మాకేం తెలియ‌దంటూ… పొంత‌న లేని స‌మాధానాలు చెబుతున్నారు. దీంతో అధికారుల నిర్ల‌క్ష్య వైఖ‌రి బ‌హిర్గ‌త‌మైంది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిరుపేద‌ల కోసం పంపిణీ చేసే నిత్యావ‌స‌రాల‌ను ఇలా…ఎందుకు ప‌నికి రాకుండా ఉంచ‌డంపై అనేక విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికైనా ఉన్న‌తాధికారులు స్పందించి…నిల్వ ఉంచిన కందిప‌ప్పు, బియ్యంను స్వాధీనం చేసుకొని ఇందుకు కార‌కులైన అధికారులపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని గ్రామ‌స్థులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *