- 400 మంది విద్యార్థులకు ఆధార్ కార్డులు, జనన ధృవీకరణ పత్రాలు అందజేసిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
- తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడంలో ముందున్న ఎమ్మెల్యే
- పిల్లల మధ్య ముందస్తు జన్మదిన వేడుకలు జరుపుకున్న ప్రశాంతిరెడ్డి
వారంతా గిరిజన బాల బాలికలు.. వారి తల్లిదండ్రులు సరిగా చదువుకోరు.. కూలీనాలీ చేసుకుంటూ.. జీవిస్తుంటారు. కానీ.. బిడ్డలను చదివించుకోవాలని అందరికీ ఉంటుంది.. బిడ్డలను బడులకు పంపుతున్నారు. చదువు కుంటున్నారు.. అయితే వారికి సరైన గుర్తింపు కార్డులు లేవు.. రికార్డు పరంగా ఏ పత్రం లేదు.. ఎన్నికల ప్రచారంలో.. పథకాలను ప్రజలకు చేరువు చేసే క్రమంలో గ్రామం.. గ్రామం.. ఊరు.. పల్లె.. ఇంటింటికి తిరిగే సమయంలో ఆ చిన్నారులకు సరైన గుర్తింపు లేదని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గుర్తించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని.. సంబంధిత అధికారులతో చర్చించారు. ఎలా చేస్తే వారందరికీ మేలు చేసినవారం అవుతామని ఆలోజించారు. ఈ విషయమై ఆమె అసెంబ్లీలోనూ తన గళం వినింపించారు. గిరిజనులు, వారి జీవన విధానంపై సుదీర్ఘంగా మాట్లాడారు. వారి అభివృద్ధికి ఆమె శ్రీకారం చుట్టారు.
అంతే.. ఇందుకూరు పేటలలో 400 మంది ఎస్టీ పిల్లలకు ఆధార్ కార్డులు, జనన ధృవీకరణ పత్రాలు సిద్ధం చేశారు. రేపు శుక్రవారం ప్రశాంతిరెడ్డి జన్మదినం. అయితే ఆమె అందుబాటులో ఉండరు. ఈ సందర్భంగా గురువారం నగరంలోని తన నివాసంలో ఆ గిరిజన పిల్లలతో.. అతి కొద్ది మంది పార్టీ నేతల మధ్య ముందస్తు జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఆ పిల్లల మధ్య కేకు కోసి.. అందరికీ పంచిపెట్టారు. ఆ పిల్లలందరికీ ఆధార్ కార్డులు, జనన ధృవీకరణ పత్రాలు అందజేశారు. వారి కళ్లల్లో ఆనందాన్ని చూసి ఎమ్మెల్యే కళ్లు కూడా ఆనందంతో చెమ్మగిల్లాయి. ఎంత చేసినా.. ఎంత సంపాదించినా.. ఎంత పేరు ప్రతిష్టలు పొందినా.. ఈ సంతోషం.. ఆనందం తనకు దక్కదని ఈసందర్భంగా ప్రశాంతిరెడ్డి తన ఆనందాన్ని వారితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, బెజవాడ వంశీ కృష్ణా రెడ్డి, చెంచుకిషోర్ యాదవ్, జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి ఇందుకూరుపేట మండల ఎంపిడిఒ నాగేంద్ర, మండల పరిధిలోని వివిధ పాఠశాలలకు చెందిన పలువు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.