అధికారులకు అవ‌గాహ‌న క‌ల్పించిన NDRF బృందం

  • 21న కోట‌పోలూరు చెరువులో మాక్‌డ్రిల్‌కు స‌ర్వంసిద్ధం
  • సూళ్లూరుపేట త‌హ‌సీల్దార్ ఎస్‌వీ న‌ర‌సింహారావు

తిరుప‌తి జిల్లా సూళ్లూరుపేట మండల పరిషత్ కార్యాలయంలో అధికారులకు నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వారు అవగాహన సమావేశం నిర్వహించారు. త‌హ‌సీల్ధార్ ఎస్‌వీ నరసింహ రావు ఆధ్వ‌ర్యంలో జరిగిన ఈ సమావేశంలో NDRF కు చెందిన అధికారుల బృందం వీడియో ప్రదర్శనల ద్వారా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు NDRF బృందాలు ఎలా పని చేస్తాయో వివరించారు. తుఫాన్లు సంభవించినప్పుడు ప్రభుత్వ శాఖల అధికారులు ఎలా స్పందించాలో అవగాహన కల్పించారు. ఈ సంద‌ర్భంగా త‌హ‌సీల్దార్ ఎస్‌వీ న‌ర‌సింహారావు మీడియాతో మాట్లాడారు. ప్ర‌కృతి వైఫ‌రీత్యాల‌ను ఎదుర్కోనేందుకు అధికారుల‌కు ఎన్‌డీఆర్ఎప్ బృందం అవ‌గాహ‌న క‌ల్పించ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ మేర‌కు కోట‌పోలూరు చెరువులో మాక్‌డ్రిల్ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. బుధ‌వారం సాయంత్రం 4 గంట‌ల స‌మ‌యంలో జ‌రిగిన‌ ఈ కార్య‌క్ర‌మంలో సీఐ మురళీకృష్ణ, SI బ్రహ్మ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *