- ఏపీ ఎన్వినాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్గా పోలంరెడ్డి దినేష్రెడ్డి బాధ్యతల స్వీకరణ
- కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డిల సమక్షంలో బాధ్యతలు చేపట్టిన దినేష్రెడ్డి
విజయవాడ ఏపీఐఐసీ కాలనీలోని ఏపీ మార్క్ఫెడ్ బిల్డింగ్ లో ..ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్గా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికారప్రతినిధి పోలంరెడ్డి దినేష్రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా పూజా కార్యక్రమాలు ముగించి.. అనంతరం ఆయన ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ బాధ్యతల స్వీకారణ మహోత్సవానికి హాజరైన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, దినేష్రెడ్డి తండ్రి, మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా దినేష్రెడ్డిని తండ్రి పోలంరెడ్డి దీవించగా.. ప్రశాంతిరెడ్డి శుభాకాంక్షులు తెలియజేశారు. ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్గా రాణించాలని, పార్టీకి, ఆ పదవికి మంచి పేరు తీసుకురావాలని ఈసందర్భంగా వారు కోరారు.