పోలింగ్ స్టేషన్ పరిధిలోనే ఓటు ఉండాలి…!

  • కావలి పట్టణంలో ఓటర్ల సవరణ, నమోదు ప్రక్రియ ప్రారంభం
  • ఇంటింటి సర్వే చేపట్టే బీఎల్వోలకు సహకరించాలి
  • ఓటు బదిలీకి ఫాం 8 ద్వారా, కొత్త ఓటు నమోదుకు ఫాం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • మీడియా సమావేశంలో కోరిన కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్

కావలి పట్టణంలో ఓటర్ల సవరణ, నమోదు ప్రక్రియ జరుగుతుందని కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఓటరు ఎక్కడ నివాసం ఉంటున్నాడో ఆ ప్రాంతం పోలింగ్ కేంద్రంలో వారి ఓటు అండేలా చూసుకోవాలని సూచించారు. వివరాలకు స్థానిక సచివాలయం, బీఎల్వోలను సంప్రదించాలని తెలిపారు. ఓటు బదిలీకి ఫాం 8 ద్వారా, కొత్త ఓటు నమోదుకు ఫాం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి అందించే అనేక సంక్షేమ పథకాలు లబ్దిదారులకు అందించే సమయంలో బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నంబర్ లింక్ లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ వారి ఖాతాలకు ఆధార్ లింక్ చేసుకోవాలని సూచించారు. కావలి పట్టణంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వారు ఎంచుకునే రంగాల్లో స్కిల్స్ డవలప్ చేసే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *