- సేవా కార్యక్రమాలు చేయాలంటే మంచి మనసు ఉండాలి.
- కృష్ణపట్నం లో భాస్కర్ నాయుడు ముందస్తు పుట్టినరోజు వేడుకలు.
- రక్తదానం చేసిన యువకులు, కేక్ కట్ చెసి శుభాకాంక్షలు.
- హరిహరాదుల సేవాసమితి ఆధ్వర్యంలో వేడుకలు.
నలుగురికి సేవ చేయాలంటే మంచి మనసు ఉండాలని.. అటువంటి మనసున్న మొపూరు భాస్కర్ నాయుడి ని యువత ఆదర్శంగా తీసుకోవాలని టీడీపీ మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా… ముత్తుకూరు మండలం కృష్ణపట్నం లో హరిహరాదుల సేవా సమితి వ్యవస్థాపకులు ఆవుల పాండురంగయ్య ఆధ్వర్యంలో శివాజీ యూత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నోవా బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు మోపూరు భాస్కర్ నాయుడు ముందస్తు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు టీడీపీ ముత్తుకూరు మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ , అదాని పోర్ట్ సీఎస్సార్ హెడ్ రాజీవ్ రంజన్ తదితరులతో కలసి భాస్కర్ నాయుడు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మొపూరు పుట్టినరోజు సందర్భంగా పలువురు రక్తదానం చేశారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ… భాస్కర్ నాయుడు భవిష్యత్తు లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అక్కయ్యగారి ఏడుకొండలు, శంకర్, మస్తాన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.