దాడికి చేసిన వారిని క‌ఠినంగా శిక్షించాలి

  • టీడీపీ నాయ‌కుడు తువ్వ‌ర ప్ర‌వీణ్‌కుమార్ డిమాండ్

రామన్నపాలెం కొత్తూరు గ్రామంలో వైసిపి పార్టీకి చెందిన సర్పంచ్ భర్త కాకి శ్రీనివాసులు తన అనుచరులతో కలసి టిడిపి నాయకుడు మాజీ సర్పంచ్ ఐన డేగ దయాకర్ రెడ్డి పై గ్రామసుడైన వెంకయ్య పై చేసిన దాడి ని తీవ్రంగా కండిస్తున్నామని టిడిపి నాయకుడు తువ్వర ప్రవీణ్ కుమార్ అన్నారు . కొడవలూరు మండలకేంద్రంలోని పోలీస్ స్టేష‌న్ లో దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరుతూ… టిడిపి నాయకులతో కలసి డేగ దయాకర్ రెడ్డి ఎస్సై కోటిరెడ్డి కి వినతిపత్రం అందజేశారు.

డేగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ… వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రామన్నపాలెం గ్రామంలో గతంలో ఉన్న టిడిపి పార్టీ కార్యాలయాన్ని వైసిపి పార్టీకి చెందిన నాయకులు పగలగొట్టి సొంత కొట్లు కట్టుకుని వాడుకుంటున్నా మేము పట్టించుకోలేదని అన్నారు .ప్రస్తుతం ఆ స్థలం పక్కనే ఉన్న మూడు అంకణాల స్థలంలో పార్టీ కార్యాలయాన్ని కట్టుకుంటుంటే వైసిపి నాయకులు అడ్డుకుని మాపై దాడికి పాల్పడడం దారుణమన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులను పోలీసులు కఠినంగా శిక్షించాలని అన్నారు . ఆయన వెంట టిడిపి నాయకులు గ్రామస్తులు ఉన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *