- కనుపూరు కాలువకి సాగునీటిని విడుదల చేసిన సోమిరెడ్డి
పొదలకూరు మండలంలోని కనుపూరు కాలువ రెగ్యులేటర్ వద్ద…కనుపూరు కాలువకి సాగునీటి విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విచ్చేశారు. ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలువ రెగ్యులేటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి…గంగమ్మకి సారె సమర్పించి రైతులతో కలిసి కనుపూరు కాలువకు సాగునీటిని విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో రైతులకి మంచి రోజులు వచ్చాయని పేర్కొన్నారు.