పథకాలు అమలుపై కలెక్టర్ ఆరా…!

  • కలిగిరి మండలం వెలగపాడు పంచాయతీలో కలెక్టర్ ఆనంద్ పర్యటన
  • క్షేత్రస్థాయిలో స్వయంగా పథకాలు అమలు పరిశీలన

కలిగిరి మండలం వెలగపాడు పంచాయతీలో కలెక్టర్ ఆనంద్ పర్యటించారు. క్షేత్రస్థాయిలో
పథకాలు అమలును స్వయంగా సందర్శించారు. వెలకపాడులో నిర్మాణంలో ఉన్న గోకులం షెడ్డు ను పరిశీలించారు. అక్కడ రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పాడి పశు పోషణ లాభనష్టాలను తెలుసుకున్నారు. అదే విధంగా స్థానిక సమస్యలను అడగగా చెరువుకు సోమశిల నీరు రానివ్వకుండా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సిమెంట్ రోడ్లు, డ్రెయిన్ కాలువల నిర్మాణం చేయించాలని కోరగా, ప్రాదాన్యత ప్రకారం మంజూరు చేస్తామని కలెక్టర్ వారికి తెలిపారు. అనంతరం నారాయణపురంలో నిమ్మతోటలను పరిశీలించారు.

ఉద్యానవన శాఖ నుంచి రాయితీ పథకాలు ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారని, సాగులో లాభ నస్టాలు గురించి నిమ్మసాగు రైతులను ప్రశ్నించారు. కలెక్టర్ వెంట డ్వామా పీడీ, తాసిల్ రవీంద్రబాబు ఎంపీడీవో ప్రత్యూష సర్పంచ్ వెంకటసుబ్బయ్య తదితర అధికార సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *