- 48 గంటల్లో లబ్ధిదారుల అకౌంట్ కి నగదు జమ
- చిత్తూరు కలెక్టర్ జీ విద్యాధరి వెల్లడి
దీపం-2 ద్వారా సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ లను ప్రభుత్వం పంపిణీ చేస్తోందని… చిత్తూరు కలెక్టర్ విద్యాధరి తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరులో కలెక్టరేట్లో ఆమె మీడియా సమావేశం నిర్వహించి దీపం -2 పథకానికి సబంధించిన వివరాలను తెలియజేశారు. డిసెంబర్ నుండి మార్చి వరకు ఒక సిలిండర్, ఏప్రిల్ నుండి జూలై వరకు ఒక సిలిండర్, ఆగస్టు నుండి నవంబర్ వరకు ఒక సిలిండర్ చొప్పున ఉచిత రీఫిల్లింగ్ చేసుకోవాలని తెలిపారు. బి పి ఎల్ రేషన్ కార్డు, ఆధార్ కార్డ్ లింక్, యాక్టివ్ ఎల్ పి జి కనెక్షన్, ఇ -కేవైసి ఉన్న వారు అర్హులన్నారు. లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ పొందే సమయంలో నగదును చెల్లించాలని, నగదు చెల్లించిన 24 నుండి 48 గం. ల లోపు లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్ కు ప్రభుత్వం జమ చేస్తుందని వివరించారు.