- నలుగురు నిందితుల నుంచి 20.8 కేజీల గంజాయి, ఒక సెల్ఫోన్ స్వాధీనం
- వివరాలు వెల్లడించిన నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు
తడ శ్రీ సిటీ వద్ద నలుగురు గంజాయి దొంగల అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 3 లక్షల విలువ చేసే 20.8 కేజీల గంజాయితో పాటు ఒక సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా…నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. గంజాయి విక్రయించినా… గంజాయి సేవించి పట్టుబడిన కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు…నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరచి…కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ఈ నలుగురు గంజాయి స్మగ్లర్లను చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సూళ్లూరుపేట సీఐ మాకినేని .మురళీకృష్ణ, తడ ఎస్సై కొండప్ప నాయుడు బృందాన్ని డిఎస్పి చెంచుబాబు అభినందించారు.