మైన‌ర్ బాలిక కేసులో ఎవ‌ర్ని వ‌ద‌లొద్దు…

  • నిందితులంద‌రికి క‌ఠిన శిక్ష‌లు ప‌డాలి
  • టిడ్కో చైర్మ‌న్ వేముల‌పాటి అజ‌య్‌కుమార్
  • వెంక‌టేశ్వ‌ర‌పురం టిడ్కో గృహాల్లో అత్యాచారానికి గురైన మైన‌ర్ బాలికని ప‌రామ‌ర్శించిన వేముల‌పాటి

ఓ మైన‌ర్ బాలిక‌పై ప‌లు అత్యాచారానికి పాల్ప‌డిన కేసులో…ఎవ‌రిని ఉపేక్షించ‌వ‌ద్ద‌ని…నిందితులంద‌రికి క‌ఠిన శిక్ష‌లు ప‌డాల‌ని టిడ్కో చైర్మ‌న్ వేముల‌పాటి అజ‌య్‌కుమార్ పోలీసుల్ని కోరారు. ఈ సంద‌ర్భంగా నెల్లూరు న‌గ‌రం వెంక‌టేశ్వ‌ర‌పురంలోని టిడ్కో గృహంలో నివాసం ఉంటున్న‌…బాధిత మైన‌ర్ బాలిక కుటుంబాన్ని ఆయ‌న జ‌న‌సైనికుల‌తో క‌లిసి ప‌రామ‌ర్శించారు. ఘ‌ట‌న‌పై కుటుంబ స‌భ్యుల్ని వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. బాలిక కుటుంబానికి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని వారికి అజ‌య్‌కుమార్ ధైర్యాన్ని క‌ల్పించారు. ఈ నేప‌థ్యంలో…టిడ్కో గృహాల్లో నెల‌కొన్న ప‌లు స‌మ‌స్య‌ల్ని ల‌బ్దిదారులు ఆయ‌న దృష్టికి తీసుకెళ్లారు. ఈ సంద‌ర్భంగా అజ‌య్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్య‌క్ర‌మంలో జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *