భూమిలో అడుగు పెడితే చంపేస్తా…

  • రైతు దంప‌తుల‌పై దాడి..పెట్రోల్ పోసి హ‌త్యాప్ర‌య‌త్నం
  • పెనుమూరులో ఘ‌ట‌న

భూమిని విక్రయిస్తామని చెప్పి లక్షలాది రూపాయలు తీసుకొని రైతును మోసం చేయడమే కాకుండా దాడికి పాల్పడి… పెట్రోల్ పోసి హత్య ప్రయత్నంకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా పెనుమూరు మండ‌లంలో చోటు చేసుకుంది. బాధిత రైతు రాజారెడ్డి వివ‌రాల మేర‌కు….ప్రవీణ్ కుమార్ దగ్గర రెండు ఎకరాల భూమిని లీజుకు… సెల్ అగ్రిమెంట్ రూపంలో రూ. 16 లక్షల 20వేల‌కు ఒప్పందం కుదుర్చుకుని… రూ. 9 ల‌క్ష‌ల 20వేల రూపాయలు చెల్లించారు… రిజిస్ట్రేషన్ అయిన తర్వాత డబ్బులను చెల్లిస్తామని చెప్పారు… డబ్బులు తీసుకున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి దౌర్జన్యం చేస్తూ తమ భూమిలో అడుగు పెట్టరాదని రాజారెడ్డి దంపతులపై దాడికి దిగాడు. అలాగే పెట్రోలు క్యాన్ తీసుకొచ్చి అతనిపై పోసే ప్రయత్నం చేస్తూ హత్య ప్రయత్నం చేశాడు. దీంతో రాజారెడ్డికి చిన్నపాటి గాయం కూడా అయింది తమకు న్యాయం చేయాలని రైతు జారారెడ్డి మీడియాని ఆశ్ర‌యించి జ‌రిగిన అన్యాయాన్ని తెలియ‌జేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *