విద్యుత్ చార్జీలు త‌గ్గించ‌క‌పోతే ఉద్య‌మ‌మే

  • సిటీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి నార‌ప‌రెడ్డి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి
  • రామ్మూర్తిన‌గ‌ర్ మిలీనియం స‌బ్ స్టేష‌న్ ఎదుట లాంత‌ర్ల‌తో కాంగ్రెస్ వినూత్న నిర‌స‌న

కూటమి ప్రభుత్వం సర్దుబాటు చార్జీల పేరుతో పెంచిన కరెంట్ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ సంద‌ర్భంగా నెల్లూరు సిటీ నియోజక వర్గ ఇన్చార్జి నారపరెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి ఆద్వర్యంలో న‌గ‌రంలోని రామమూర్తినగర్ వ‌ద్ద ఉన్న‌ మిలీనియం సబ్ స్టేషన్ వద్ద నిరసన చేప‌ట్టారు. కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు లాంత‌ర్లు చేత‌ప‌ట్టి…పెంచిన క‌రెంటు చార్జీల‌ను త‌క్ష‌ణ‌మే త‌గ్గించాలంటూ నినాదాలు చేశారు. అనంత‌రం కిర‌ణ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్ర‌బాబు ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌కి ఇచ్చిన ప్ర‌కార‌మే… పెంచిన కరెంట్ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని ప‌క్షంలో పెద్ద ఎత్తున ఉద్య‌మాన్ని చేప‌డుతామ‌ని హెచ్చ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *