వైభ‌వం…ల‌క్ష దీపోత్స‌వం

  • నెల్లూరు వీఆర్సీ మైదానంలో క‌న్నుల పండువ‌గా ప్రారంభ‌మైన కార్తీక మాస ల‌క్ష దీపోత్స‌వం
  • ఎంపీ వేమిరెడ్డి దంప‌తుల చేతుల మీదుగా మహాన్యాసపూర్వక శత రుద్రాభిషేకం
  • పాల్గొన్న రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి

భారీ సెట్టింగులు… ఆద్యంతం భక్తిపారవశ్యం నింపే శివ కేశవుల నామస్మరణతో నెల్లూరు నగరంలోని వి.ఆర్‌. సి మైదానం పులకించింది. నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే, టిటిడి బోర్డు మెంబర్‌ వేమిరెడ్డి దంపతుల సహకారంతో వి.పి.ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో.. కార్తీక మాస ల‌క్ష దీపోత్స‌వం అత్యంత వైభ‌వంగా ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి పాల్గొన్నారు. ముందుగా వీపీఆర్ దంప‌తుల‌కి అర్చ‌కులు వేద చంత్రోచ్చ‌ర‌ణ న‌డుమ అపూర్వ స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా గోమాత‌కు పూజ‌లు ప్ర‌త్యేక చేశారు. అనంత‌రం గణపతి పూజ, శ్రీ త్రయంబకేశ్వర్‌ జ్యోతిర్లింగం, అయోధ్య రామ మందిరం, కలశ స్థాపన కార్య‌క్ర‌మాలు వైభ‌వంగా జ‌రిగాయి. వేమిరెడ్డి దంప‌తులు చేతుల మీదుగా….మహాన్యాసపూర్వక శత రుద్రాభిషేకం జ‌రిగింది. వీపీఆర్ దంప‌తులు, శ్రీ‌ధ‌ర్‌రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్య‌క్ర‌మాల‌ను ల‌క్ష దీపోత్స‌వ క‌మిటీ స‌భ్యులు ప‌ర్య‌వేక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *