- భారతి స్వామికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన నిర్వాహకులు, అర్చకులు
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని అత్యంత ప్రసిద్ధి చెంది భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్న శక్తి మాత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి ఆలయాన్ని పవిత్ర కార్తీక మాసం సందర్భంగా శ్రీ రామానంద భారతి స్వామి దర్శించారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి తాతా శ్రీనివాసరావు అర్చక బృందం ఆధ్వర్యంలో భారతి స్వామికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భారతీస్వామి ఆశీర్వాదం పొందారు. స్వామివారు మీడియాతో మాట్లాడారు… హిందూ ధర్మాన్ని రక్షించి దైవం పట్ల ఆరాధన భావంతో మెలగాలన్నారు. పురుషులు స్త్రీలు సాంప్రదాయ దుస్తులు వేషధారణంగా ఉండాలని… దైవ సన్నిధిలో నిశ్శబ్దం పాటించాలని సూచించారు. ప్రజలందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు భారతి స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు కోడూరు శ్రీనివాసుల రెడ్డి, దేవస్థానం మాజీ చైర్మన్ సోమన శ్రీనివాసులు రెడ్డి, స్థానిక నేతలు, కుటుంబ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.