- వేస్ట్ మేనేజ్ మెంట్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
- పెద్ద ఎత్తున ఎగసి పడుతున్న మంటలు
- అదుపులోకి రాని మంటలు – భయాందోళనలో గ్రామస్థులు
వేస్ట్ మేనేజ్ మెంట్ ప్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటన… ఉమ్మడి నెల్లూరు రాపూరు మండలంలో చోటు చేసుకుంది. రావిగుంటపల్లిలోని వేస్ట్ మేనేజ్ మెంట్ ఫ్యాక్టరీలో…కెమికల్ బ్లాస్టింగ్ జరగడంతో… దట్టమైన నల్లటి పొగలతోపాటు…పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. డంపింగ్ యార్డులో ప్రమాదం జరిగిందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాహనాల్లో నుంచి డ్రైవర్లు దూసుకేసినట్లు సమాచారం. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని… మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా మంటలు అదుపులోకి రావడంతో… సమీప గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.