- తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు, పాదచారులు
- పట్టించుకోని కార్పొరేషన్ అధికారులు
నెల్లూరు నగరం ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి వద్ద…భారీగా డ్రైనేజీ నీళ్లు చేరాయి. దీంతో అటుగా ప్రయాణించే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ నీళ్లు కావడంతో భయకరంగా దుర్వాసన వెదజల్లుతోంది. అటు వెళ్లలేక ప్రజలు నరకయాతన పడుతున్నారు. సాధారణంగా చిన్నపాటి వర్షం కురిస్తేనే అండర్ బ్రిడ్జి సముద్రాన్ని తలపిస్తోంది. ప్రజలు ఇబ్బంది పడుతున్నా… సంబంధిత కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు వాపోతున్నారు. వెంటనే కార్పొరేషన్ అధికారులు స్పందించి…అండర్ బ్రిడ్జి వద్ద నిల్వ ఉన్న డ్రైనేజీ నీళ్లను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.