వింజ‌మూరులో పశుగణన సర్వే ప్రారంభం

ప‌శువుల సంఖ్య‌, రైతువారి డేటా సేక‌ర‌ణ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు మేరకు 21 వ అఖిల భారత పశుగణన కార్యక్రమం ప్రారంభించినట్లు వింజమూరు ఏరియా పశువైద్యాధికారి డాక్టర్. రఘునాధ్ రెడ్డి వెల్లడించారు. మండలంలోని ఉండే పశువులు సంఖ్యను, రైతువారి డేటా సమీకరించి ప్రతి గ్రామంలో ఎన్ని పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్ళు, ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ సర్వే చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ సర్వే వలన నిర్ధిష్ట ప్రణాళికలు రూపొందించి కులాలు వారీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పధకాలు అములు చేయుటకు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *