- ముత్తుకూరు కృష్ణపట్నం పోర్ట్ లో సునామీ రెస్క్యూ మాక్ డ్రిల్
నెల్లూరు జిల్లా… ముత్తుకూరు మండలం…కృష్ణపట్నం లో ప్రభుత్వ అధికారులు సునామి రెస్క్యూ మాక్ డ్రిల్ నిర్వహించారు. స్థానిక ఆర్కాట్ పాలెం మత్స్యకారులకు సునామీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్వహించిన ఈ మాక్ డ్రిల్ ను నెల్లూరు ఆర్డీవో నాగ సంతోష్ అనూష దగ్గరుండి పర్యవేక్షించారు. ఎస్ డి ఆర్ ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ డ్రిల్ లో సునామీ, తుఫాను సమయాల్లో మత్స్యకారులకు ఎదురైయ్యే ఇబ్బందులు…ప్రమాదం భారిన పడకుండా చేపట్టే ముందస్తు చర్యలు తదితర అంశాలపై డ్రిల్ నిర్వహించి అవగాహన కల్పించారు. రెవెన్యూ, పోలీస్, ఫైర్, హెల్త్ శాఖల సిబ్బంది తో పాటుగా కృష్ణపట్నం పోర్ట్ మెరైన్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో సునామి మాక్ డ్రిల్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు తహసీల్దార్ బాలక్రిష్ణ రెడ్డి, అధికారులు, స్థానిక మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.