- టీడీపీ – వైసీపీ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం
- చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిన కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం
నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో…నగర మేయర్ పోట్లూరి స్రవంతి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ చంద్ర శేఖర్ రెడ్డి, నగర పాలక సంస్థ అన్ని డివిజనుల కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, కమిషనర్ సూర్యతేజ, నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు సిటీ నియోజకవర్గంలోని సమస్యలపై కౌన్సిల్ సమావేశంలో గళమెత్తారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ కార్పొరేటర్ల మధ్య వాదోపవాదనలు జరిగాయి. నువ్వెంత అంటే…నువ్వెంత అంటూ ఇరువురు కార్పొరేటర్లు మాటల యుద్ధానికి దిగారు. చిన్న చిన్న ఘటనలు మినహా…కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా ముగిసింది.