- స్నేహితులతో కలిసి ఈతకెళ్లి 14 ఏళ్ల బాలుడు మృతి
- వీరేంద్ర సాయి మృతితో గ్రామంలో విషాదఛాయలు
తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మెట్టు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది… స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లి స్వర్ణముఖి నదిలో ఇసుక తవ్వకాల కోసం తీసిన గుంతలో మునిగి వీరేంద్ర సాయి (14) అనే పదవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు… పాఠశాల వదిలిన తర్వాత తోటి స్నేహితులతో కలిసి ఈతకు వెళ్ళాడు..
ఇసుక తవ్వకాలు జరిపిన ప్రదేశంలో లోతు ఎక్కువగా ఉండడంతో వీరేంద్ర సాయి ఇసుకలో కూరుకుపోయి మునిగిపోయాడు.. మరో ముగ్గురు విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు… మృతుడు స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు…విద్యానగర్ లో నివసిస్తున్న సాయికుమార్, రాధలకు ఇద్దరు సంతానం.
వారిలో మృతి చెందిన వీరేంద్ర సాయి పెద్ద కుమారుడు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థి మృతదేహాన్ని బయటకు తీశారు…విద్యార్థి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి..కన్న కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.