నాగశిలలకు పాలతో అభిషేకం చేసిన భక్తులు
నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని సంగమేశ్వరాలయంలో నాగుల చవితి పండుగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు నాగ శిలల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగ శిలలకు పాలతో అభిషేకం నిర్వహించి..శిలల వద్ద ఉన్న చెట్టుకు దారం కట్టి మొక్కుకున్నారు. అనంతరం సజ్జలు,పిండి ప్రసాదంగా పంచి పెట్టారు.