ఏపీఎఫ్‌డీసీ ఎల్అండ్ఈ నూత‌న రాష్ట్ర క‌మిటీ ఎన్నిక‌

  • నెల్లూరులోని ఏఐటీయూసీ కార్యాల‌యంలో జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశం

నెల్లూరు న‌గ‌రంలోని ఏఐటీయూసీ కార్యాల‌యంలో… ఆంధ్ర‌ప్ర‌దేశ్ అట‌వీ అభివృద్ధి కార్పొరేష‌న్ లేబ‌ర్ అండ్ ఎంప్లాయిస్ యూనియ‌న్ కార్మికుల రాష్ట్ర జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో ఏపీఎఫ్‌డీసీ ఎల్అండ్ఈ నూత‌న రాష్ట్ర క‌మిటీ ఎన్నిక జ‌రిగింది. రాష్ట్ర గౌర‌వాధ్య‌క్షులుగా శంక‌ర్ కిషోర్‌, రాష్ట్ర అధ్య‌క్షులుగా దామా అంక‌య్య‌ల‌తోపాటు రాష్ట్ర ఉపాధ్యులు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, కోశాధికారి, క‌మిటీ స‌భ్యుల‌ను ఎన్నుకున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధులుగా ఏఐటీయూసీ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శంక‌ర్ కిషోర్‌, సీపీఐ మాజీ జిల్లా కార్య‌ద‌ర్శి వీ రామ‌రాజులు విచ్చేశారు.

ఈ సంద‌ర్భంగా శంక‌ర్ కిషోర్ మాట్లాడుతూ… ప్ర‌స్తుతం యూనియ‌న్‌లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకునేందుకు క‌లిసి పోరాడుతామ‌ని పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో రాజ‌మండ్రి డివిజ‌న్‌, ఏలూరు, నెల్లూరు, కావ‌లి, స‌త్య‌వేడు, నాయుడుపేట‌, బాప‌ట్ల డివిజ‌న్ల నుంచి కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *