- మోసగాడు హాసన్ను కఠినంగా శిక్షించండి
- గ్రీవెన్స్ లో కలెక్టర్ని వేడుకున్న బాధిత విద్యార్థిని
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ చదివే విద్యార్థినిని ఓ మోసగాడు మోసం చేసి అమ్మాయి జీవితాన్ని అన్యాయం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో ఆ విద్యార్థిని ఆత్మహత్యాప్రయత్నానికి కారకుడైన మోసగాడు హాసన్ ను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో నెల్లూరు కలెక్టరేట్లో కలెక్టర్ ఆనంద్ని కలిసి వినతి పత్రం అందచేశారు. అర్జీ తీసుకున్న కలెక్టర్ విచారణ జరిపి బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాధిత విద్యార్థినీతోపాటు ఎమ్మార్పీఎస్ నాయకులు మీడియాతో మాట్లాడారు.