- గణేష్ ఘాట్లో నవంబర్ 15న సింహపురి కార్తీక దీపోత్సవం
- రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి
కార్తీక మాసం పురస్కరించుకొని ….సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో కార్తీక మహా దీపోత్సవాన్ని నవంబర్ 15న మహాద్భుతంగా నిర్వహిస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఇరుకళల పరమేశ్వరి ఆలయ అర్చకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ…ఉదయం శోభ యాత్రతో ప్రారంభించి… హరిద్వార్ నుండి వచ్చిన ఐదు మంది అర్చకుల చేత గంగా హారతి నిర్వహిస్తున్నామని చెప్పారు. అదే విధంగా 108 తెప్పలతో శివాకృతి నెల్లూరు చెరువులో దర్శనం చేస్తామన్నారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా దైవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కాశీ ఘాట్ ను తలపిస్తూ దైవిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.