- సముద్ర స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించిన భక్తులు
- భక్తులు, యాత్రికులతో కిటకిటలాడిన మైపాడు
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలోని మైపాడు సముద్ర తీరంలో కార్తీక మాసం శోభ సంతరించుకుంది. భక్తులు విశేషంగా తరలి వచ్చి…సముద్ర స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేకంగా సముద్ర తీరాన ఇసుకతో శివ లింగాల ప్రతిమను ఏర్పాటు చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీచ్ వద్ద ఉన్న శివాలయాన్ని దర్శించుకొని పాలాభిషేకాలు చేశారు. భక్తులు, యాత్రికులు విశేషంగా తరలి రావడంతో మైపాడు సముద్ర తీరం సందడిగా మారింది. కార్తీక మాసం కావడంతో…మండలంలోని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.