- సంగమేశ్వరుడికి విశేష పూజలు
- కార్తీక దీపాలు వెలిగించిన మహిళా భక్తులు
నెల్లూరు జిల్లా కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా సంగంలోని శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు . భక్తులు వేకువ జామునే ఆలయానికి వచ్చి కార్తీక దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. భక్తులు అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.